అరిషడ్వర్గాలు వాటి పర్యవసానాలు
మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు పడే  శత్రువులు , మనిషి  దుఃఖాలకు   మూల కారణాలు ' అరిషడ్వర్గాలు '.  మనిషి మనసును , చెట్టుకు పట్టిన  చెదలా  పీల్చి పిప్పి చేసేవి  ' అరిషడ్వర్గాలు '. ఈ అరిషడ్వర్గాలు  రెండు వైపులా  పదునున్న కత్తి లాంటివి .   అసలు ఏమిటి  ఈ  'అరిషడ్వర్గాలు '. "కామ , క్రోధ , లోభ  , మోహ , మధ  మరియు  మాత్సర్యం " అనే ఆరు వర్గాలే  ( శత్రువులు ) ఈ అరిషడ్వర్గాలు'.   
మనిషి అభివృద్ధికి   అడ్డు పడే , మనిషి  దుఃఖాలకు   మూల కారణమయ్యే  ఈ ' అరిషడ్వర్గాలు'  ఏమిటో వివరంగా  చూద్దాం :              
కామం :
కామం అంటే  వివిధ రకాల  శారీరక  , మానసిక కోరికలు  కలిగి ఉండటం . కామం మనిషికి ఒక  శత్రువు లాంటిది .  మనిషి  వివిధ రకాల కోరికలు  కలిగి ఉండటం వలన , విచక్షణ కోల్పోయి  చేసే  పనుల వలన  మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు  పడి , మనిషి  దుఃఖాలకు.ఆదిత్యయోగీ.మూల కారణమవుతుంది .  ఉదా :  కామంతో కీచకుడు  తనకు తానే  వినాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు . కీచకుడు  ఎవరో కాదు , విరాట మహారాజు  బావమరిది . విరాట మహా రాజు  బావమరిది ననే అహంకారంతో , తనను కూడా  లెక్క చేయ కుండా , అనేకమైన కీచక పనులు , ఆకృత్యాలు  చేసేవాడు .  అజ్ఞ్యాత వాస సమయంలో , విరాట మహారాజు  ఇంట  , సతీ  సమేతంగా   పంచ పాండవులు కొలువుదీరుతారు . అప్పుడు ఈ కీచకుడు  ద్రౌపతిని  చెర  పట్టేందుకు ప్రయత్నిస్తాడు .  తెలివిగా   ద్రౌపతి నర్తన శాలకు  రమ్మంటుంది . అక్కడ నల్లటి ముసుగులో వున్న  భీముడు,   భయంకరమైన  పిడిగుద్దులతో   కామంతో  ఊగి పోయే   కీచకుణ్ణి  హతమారుస్తాడు.
క్రోధం :
క్రోధం అంటే  కోపాన్ని , ఉద్రేకాన్ని, ఆవేశాన్ని  కల్గి ఉండటం . అనుకున్న పనులు కాలేదని , తన మాట చెల్ల లేదని, పని వత్తిడి పెరిగిందని , దానికి కారణం  ఎదుటి  వారే నని  వారిపై  కోపాన్ని ప్రదర్శించడం , కక్ష పెంచు కోవడం  మొ. నవి . కోపం  లో , ఆవేశం లో  తీసుకునే  ఏ   నిర్ణయం  కూడా  నష్ట పరుస్తుందే కాని  విజయాన్ని  చేకూర్చదు . క్రోధం  మనిషికి ఒక  శత్రువు లాంటిది . క్రోధం   కలిగి ఉండటం వలన , విచక్షణ కోల్పోయి  చేసే  పనుల వలన  మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు పడి , మనిషి  దుఃఖాలకు   మూల కారణమవుతుంది .  ఉదా : శ్రీ  మహావిష్ట్నువు  మీద  క్రోధం వలన  హిరణ్యకశ్యపుడు , తన కొడుకు  ప్రహల్లాదుడు  నిరంతరం  హరినామ  స్మరణం  చేయడం  తట్టుకోలేక , కన్నా కొడుకని  కూడా చూడ కుండా, అత్యంత  కఠినమైన  శిక్షలు  పెడుతాడు . ఐనను   ప్రహల్లాదుడు హరి నామ స్మరణ  మానడు . " ఎక్కడరా  నీ  హరి  , ఈ  స్థంభం లో చూప మనగా " ,  " ఇందు గల డందు లేడన  వలదు , ఎందెందు  వెతికినా  నందు గలడు  హరి "   అంటాడు  ప్రహల్లాదుదు . వెంటనే  అదే  స్తంభాన్ని  చీల్చుకుని  శ్రీ  లక్ష్మి  నరసింహ  స్వామి  వచ్చి , హిరణ్యకస్యపున్ని  హతమారుస్తాడు . 
లోభం :
లోభమంటే  పిసినారి తనం . తాను  సంపాదించింది  తనకు  తప్పా ఇతరులకు  చెంద కూడదు  అని అనుకోవడం . ఈ లోభత్వం గల  కొందరు  తాము తినరు , ఇతరులను  తిన నివ్వరు . చివరికి అది , దొంగల పాలో  లేక  భూమి పాలో కాక తప్పదు . లోభం  మనిషి ఎదుగుదలకు , దేశ అభివృద్దికి  ఒక  శత్రువు లాంటిది . ఉదా : ద్రుతరాసష్ట్రుడికి  లోభం ఎక్కువ . దేశ సంపద అంతా తన కొడుకులైన  దుర్యోధనాది  నూరుగురు కౌరవులకే  దక్కాలి గాని , పాండవులకు  సూది మొన  భూమి కూడా  చెంద  కూడదని  ఎత్తులు వేసి ,  ఓడించి , వారిని అరణ్య వాసం  పంపిస్తాడు . కాని  చివరికి  పాండవుల చేతిలో  లోభులైన  , క్రూరులైన , హీనులైన  కౌరవులు ,  అత్యంత ఘోరంగా  మరణిస్తారు .  
మోహం :
మోహమంటే  అత్యధిక  కోరికలు కలిగి ఉండటం . అత్యధికంగా  వ్యామోహం  కలిగి ఉండటం . అభి మానం  పెంచుకోవడం .  తాను కోరుకున్నది తనకే  చెందాలి తప్పా  ఇతరులకు  చెంద కూడదు  అనే  గట్టి  భావన కలిగి ఉండటం . దానినే  ఇతరులు పొందితే  తట్టుకోలేక పోవడం . అనుకున్న కోరిక తీరక పోతే  మానసికంగా  క్రుంగి పోతారు .  మోహం  మనిషికి ఒక  శత్రువు లాంటిది .  ఉదా : కన్న  కొడకు పై  వ్యామోహంతో , కైకేయి  , రాముడిని కాకుండా  , భరతునికే   పట్టాభి షేకం  చేయాలని  కోరగా , మాట తప్పని  దశరథ మహారాజు  రాజు  , రాముడిని  14 సంవత్సరాలు  అరణ్య వాసానికి  పంపడం  , ఆ తరువాత   సీతా మాత , శ్రీ  రాముడు ఎదుర్కొన్న  శారీరక  మానసిక  బాధలు  వర్ణనాతీతం . చివరికి సీత  అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది  . భరతుడు  రాజ్యాధికారం  ఒప్పుకోలేదు .  అలానే  ద్రుత రాష్ట్రుడు కూడా తన కొడుకులైన  కౌరువలపై  వాళ్ళ మాలిన  వ్యామోహం  వలన  , వారిని సక్రమ మార్గం లో పెంచక సర్వాన్ని కోల్పోతాడు .   
మదం :
మదమనగా   గర్వం .  గాంభీర్యాన్ని  ప్రదర్శించడం . గొప్పలకు  పోవడం . అంతా  నా  వల్లనే  జరిగింది, ఇది నా వల్లనే సాధ్యం  . నేను  లేక పోతే  ఇది జరిగేది కాదు  అని  తమకు తామే  జబ్బలు  చరుచు కోవడం. ఎదుటి వారిని  లెక్క  చేయక పోవడం , కించ పరుచడం , దూషించడం , చిన్న చూపు చూడటం.  మధం   మనిషికి ఒక  శత్రువు లాంటిది . 
ఉదా : మధం తోటి , లంకాధి పతి  రావణా సురుడు, తన  మాయలతో  బంగారు  జింకను  సృష్టించి , శ్రీ రాముడిని  , లక్ష్మణుడిని  అటు వైపు  మళ్ళించి , మారు వేషంలో  బిక్షాటనకు  వచ్చి , శ్రీ రాముడు  గీసిన  గీతను  కూడా దాటి  వచ్చి  బిక్షం వేయాలని  ఒప్పించి , సీతను  అపహరించి,  లంకలో బంధిస్తాడు . హనుమంతుడు లంకకు  నిప్పు పెట్టినా  లెక్క చేయడు . వద్దని  వారించిన  తమ్ముడు విభీషణుడిని తరిమి  కొడుతాడు.  శ్రీ రాముడు తో  తలపడి  సర్వాన్ని కోల్పోతాడు . చివరికి   శ్రీ  రాముడి  చేతిలో  తానూ  హతుడయ్యాడు  
మాత్సర్యం :
మాత్సర్యం అనగా  అసూయ , ఈర్ష్య , ద్వేషం . సిరి సంపదలన్నీ  తనకే దక్కాలి గాని  , ఇతరులకు దక్కకూడదు  అనే  భావన  , ఆలోచన  కలిగి ఉండటం . ఇతరులు  ఇండ్లు కట్టుకుంటే  చూసి  ఈర్ష్య  పడటం , ఇతరులు  బట్టలు కొనుక్కుంటే  చూసి  అసూయ పడటం , ఇతరుల ఇంట్ల  పెండిండ్లు  అవుతుంటే ఏడవడం మొ . నవి  గా చెప్పుకోవచ్చు .   ఉదా : పాండవుల ఎదుగుదలను  జీర్నిచుకోలేని  దుర్యోధుని మామ ' శకుని '  ఈర్ష్యతో ,  వారిని ఎలాగో  ఓడించాలని  మోసపూరిత  పాచికలు  వేసి , ఓడించి  పాండవులను  12 సంవత్సరాలు  అరణ్య వాసం  1 సంవత్సరం అజ్ఞ్యాత వాసం  పాలు చేస్తారు . 
ఈ అరిషడ్వర్గాలు  మనిషిని  శారీరకంగా  , మానసికంగా , ఆర్ధికంగా  సాంఘీక  పరంగా , సామాజిక పరంగా  అదః పాతాళ లోకానికి  త్రొక్కేస్తాయి . అందుకని  వీటిని  ఎప్పుడూ అదుపులో ఉంచు కోవాలి .  ఎప్పుడూ అవి మన అదుపులో ఉండాలి   గాని  , వాటి  అదుపు  లోకి మనం పోకూడదు ..
ఆత్మానుభూతి అంటే ఏమిటి అది ఎలా అనుభవిస్తాము.!
ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి. కానీ, నేడు అనేకమంది తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నారు.
నిజానికి సుఖం, సంతోషం, ఆనందం.. ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడు రకాల అనుభూతులు...
- పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.
 - వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే 'సంతోషానుభూతి' మానసికం.
 - వీటికి అతీతమైంది
 
"ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం. ఆనందం, ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి...సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం. శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం.
- మొదటిది బంధం,
 - రెండవది తాత్కాలితం,
 - మూడవది శాశ్వతం...
 
మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు, కానీ పరమానందస్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు.
ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు, ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు, అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం...
అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి...
మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి.
ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే, ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.
ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు, (తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. )
మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.
- మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం.
 - మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన...
 - వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత...
 - మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత...
 
ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే,
ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది, మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి... అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని... ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...
- సత్ అంటే సత్యం,
 - చిత్ అంటే చైతన్యం,
 - ఆనందమంటే పరమానందం..
 
ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే). ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం...
అందరిలో అంతర్యామిని గుర్తించడం. ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం, భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం.
  భగవాన్ తో  ఒక  భక్తుడు ..  నేను  ఏదో  సాధన  చేసుకుంటున్నాను,  మీ దయ  కూడా  నాకు  కావాలి  అని  అడిగాడు.  దానికి  భగవాన్ ..  దయ  నువ్వు  అడిగితే  ఇచ్చినట్టు,  నువ్వు  అడగకపోతే  ఇవ్వనట్టా  అన్నారు.  *ఏ జ్ఞాని  దయ  లేకుండా  ఉండడు.  మీరు  అడగలేదని  జ్ఞాని  దయ  ఇవ్వకుండా  ఉండడు.ఆదిత్యయోగీ.
మీ పిల్లలు  ఆడుకుంటున్నారనుకోండి ..  వాళ్ళు  మరిచిపోయినా,  టైమ్ కి  మీరు  ఆటలు  మానిపించి  అన్నం  పెడతారు.  అలాగే  భగవంతుడు  మన  తల్లి !  ఆయన  స్వరూపమే  దయ !  ఆయన  ఇవ్వకుండా  ఎలా  ఉంటాడు ? 
- కృష్ణా .. కృష్ణా ..
 - రామా .. రామా ..
 - శివా .. శివా ..
 - రమణా .. రమణా ..
 
ఇలా  ఏదైనా  నామం  చేసుకుంటున్నారు  అనుకోండి ..  మీకు  భక్తి  లేకపోయినా,  కాలక్షేపం  కోసం  చేసుకున్నా,  తెలియక  చేసుకున్నా  మీ లోపల  ఉన్న  అజ్ఞానానికి  నిప్పు  అంటుకుంటుంది.  భగవంతుడు  మీ అహంకారానికి  కోత  కోస్తాడు.  మీరు  నిప్పుమీద  తెలియక  చెయ్యి  వేసినా  అది  అంటుకుంటుంది.  అలాగే  మీరు  సరదాకోసం  అనుకున్నా  *భగవంతుని  నామం  మీ అజ్ఞానాన్ని  కాల్చేస్తుంది.  అట్టిది  నామం !
By: దుర్గి శ్రీకాంత్ శర్మ 








