విశ్వకర్మ జయంతి ప్రత్యేకం:
విశ్వకర్మ ఎవరు?
విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మకు ఘంటాన్ని, దేవతలు కు పుష్పక విమానాన్ని, మహాశక్తి కి దివ్య రధాన్ని, దేవేంద్రునికి అమరావతి నగరాన్ని, పాండవులకు ఇంద్ర ప్రస్థాన్ని సృష్టించి ఇచ్చాడు విశ్వకర్మ. మను, మయ, శిల్పి, త్వష్ట, దైవజ్ఞ అను ఐదుగురు 'నిర్మాణ బ్రహ్మలు' విశ్వ కర్మ కు రచనాదేవి కి పుట్టిన బిడ్డలు. అపూర్వమైన 'ఆదిమ వాస్తు గ్రంధం' విశ్వ కర్మ రచించినదే. సమస్త చేతి వృత్తుల వారికీ ఈయనే మూల పురుషుడు.